చెత్తను శుభ్రం చేస్తుంటే బుస్‌మంటూ శబ్దం.. తీరా చూస్తే భారీ పైథాన్

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (09:55 IST)
సికింద్రాబాద్ రైల్ నిలయం పార్కులో భారీ కొండ చిలువను పారిశుద్ధ్య కార్మికులు గుర్తించారు. ఈ పార్కులోని చెత్తను శుభ్రం చేస్తుంటే బుస్ మంటూ శబ్దం వచ్చింది. దీంతో ఆందోళన చెందిన వారు మెల్లగా చెత్తను తొలగించగా, ఆ చెత్తలో భారీ కొండ చిలువ దాగివుండటం చూసి వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్‌ ద్వారా ఆ కొండ చిలువను బంధించారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
సికింద్రాబాద్ రైల్ నిలయం వెనుక వైపున రైల్వే కాలనీ పార్కు ఉంది. ఇందులో మంగళవారం మధ్యాహ్నం సమయంలో పార్కులో పేరుకునిపోయిన చెత్తను పార్కు సిబ్బంది శభ్రం చేస్తున్నారు. పార్కులో ఉన్న చెత్తను తొలగిస్తున్న సమయంలో ఏవో శబ్దంతో పాటు కదలికలు కనిపించాయి. ఆ తర్వాత మెల్లగా చెత్తను తొలగించగా, ఏకంగా 14 అడుగుల భారీ కొండ చిలువను చూసి ఖంగుతిన్నారు. అక్కడ నుంచి వారు పరుగులు తీశారు. ఆ తర్వాత పాములుపట్టేవారి సాయంతో ఆ కొండ చిలువను బంధించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raghu Kunche: గేదెల రాజు క్యారెక్టర్ భయపెట్టేలా ఉండేందుకు 12 కేజీల పెరిగాను : రఘు కుంచె

Vijay Sethupathi: పూరి జగన్నాథ్- స్లమ్ డాగ్ స్పెషల్ ఫిల్మ్ గా గుర్తుండిపోతుంది : విజయ్ సేతుపతి

Chiranjevi: గొప్ప మనసు చాటిన మెగాస్టార్ చిరంజీవి 20 లక్షల వైద్య సహాయం

Poonam Kaur : భీమేశ్వర ఆలయంలో పూనమ్ కౌర్ పూజలు

Sapthagiri: పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పురుష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అక్షయ తృతీయ ప్రచారంతో కృతిశెట్టితో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రకటించిన ఇంద్రియ

హైదరాబాద్‌లో తొలిసారిగా జరిగిన ది లీలా మొజాయిక్ 2026కి విశేష స్పందన

మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం

శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు

విక్టోరియా సీక్రెట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ప్రకటించిన అప్పారెల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments