Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత నిర్లక్ష్యమా..? కరోనా రోగుల మృతదేహాల్ని కుక్కలు పీక్కుతింటున్నాయ్..!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (11:24 IST)
కరోనా రోగుల మృతదేహాల పట్ల జీహెచ్ఎంసీ అధికారుల నిర్ల్యక్ష్యం చేస్తున్నారు. హైదరాబాద్ ఈఎస్ఐ స్మశాన వాటికలో దారుణం చోటుచేసుకుంది. సగం కాలిన కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్నాయి. మృతదేహాన్ని పూర్తిగా కాల్చకుండానే కాటికాపర్లు వదిలేశారు. దీంతో మృతుడి పుర్రెలు, చేతులు బయటకు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకున్న కుక్కలు మృతుడి శరీర భాగాలను పీక్కుతింటున్నాయి. దీనికి కారణం జీహెచ్ఎంసీ అధికారుల నిర్ల్యక్షమే అనే ఆరోపణలు వస్తున్నాయి.
 
కోవిడ్‌తో మరణించిన వారి నుంచి కూడా ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉండటంతో అంత్యక్రియల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా బారిన పడి ఆత్మీయులు చనిపోయినా చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉంటుండటంతో.. అంత్యక్రియలను కూడా మున్సిపాలిటీ సిబ్బంది చేస్తున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వం లేకుండా కరోనా మృతదేహాలను గుంతల్లోకి విసిరేస్తున్న వీడియోలు ఇటీవలే బయటకొచ్చాయి. ఇప్పుడు సగం కాలిన మృతదేహాల దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా వైరస్‌తో ఆత్మీయులు చనిపోయి కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో ఉండగా, వారిని మరింత క్షోభ పెట్టేలా సిబ్బంది అమానుషంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. కనీసం అంతిమ సంస్కారాలైనా సరైన పద్ధతిలో నిర్వహించి వారి ఆత్మకు శాంతి చేకూరేలా చూడాలని కోరుతున్నారు.
 
కాగా.. చనిపోయిన వారి వివరాలను నమోదు చేయడం, అంత్యక్రియలు నిర్వహించడం వంటివి జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం శ్మశాన వాటికలో సిబ్బందిని కూడా నియమించింది. కానీ కరోనా పేషెంట్ల మృతదేహాలు సరిగా కాలకపోయినా సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఓ వ్యక్తి తన తాతయ్య అస్థికల కోసం శ్మశానానికి రాగా సగం కాలిన డెడ్ బాడీలను కుక్కలు పీక్కుతినడం చూసి షాకయ్యాడు. కాగా, మృతదేహాలు పూర్తిగా కాలే వరకూ చూడాల్సిన బాధ్యత మాది కాదంటే మాది కాదని శ్మశాన వాటిక నిర్వాహాకులు, జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments