Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్దియా పోరులో చిత్ర విచిత్రాలు : ఎమ్మెల్యే భార్య ఓటమి.. మేయర్ సతీమణి గెలుపు

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (20:57 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అధికార తెరాస దూకుడుకు భారతీయ జనతా పార్టీ బ్రేకులు వేసింది. పాతబస్తీలో ఎంఐఎం ఎప్పటిలానే తన సత్తా చాటింది. ఇక కాంగ్రెస్, ఇతర పార్టీలు పత్తాలేకుండా పోయాయి. ఇదిలావుంటే, ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 
 
ముఖ్యంగా, ఉప్పల్ తెరాస ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య స్వప్న ఓటమి చవిచూశారు. స్వప్న హబ్సీగూడ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, ఎమ్మెల్యే అర్ధాంగికి బీజేపీ అభ్యర్థి షాకిచ్చింది. 
 
హబ్సీగూడలో బీజేపీ అభ్యర్థి చేతన విజయం సాధించింది. అటు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి యాదవ్ చర్లపల్లి డివిజనులో జయభేరి మోగించారు. శ్రీదేవి యాదవ్ తన ప్రత్యర్థి సురేందర్ గౌడ్ (బీజేపీ)పై నెగ్గారు. 
 
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌పై తాజా సమాచారం ప్రకారం... తెరాస ఇప్పటివరకు 56 డివిజన్లను కైవసం చేసుకుంది. అలాగే, బీజేపీ 49 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల, ఎంఐఎం 43 సీట్లలో విజయభేరీ మోగించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments