Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇల్లు ఖాళీ చేసి సామాగ్రిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లు : లేడీ డాక్టర్‌కు బెదిరింపు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:59 IST)
కరోనా వైరస్ బారినపడుతున్న రోగులకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, ఇతర సహాయక సిబ్బంది లేనిపోని సమస్యల్లో పడుతున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్ళలో నివసించే వారికి ఆ గృహ యజమానుల నుంచి బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. వైద్యులను బెదిరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
తాజాగా సికింద్రాబాద్ నగరంలో స్విగ్దా అనే మహిళా వైద్యురాలికి గృహ యజమాని నుంచి తీవ్ర వేధింపులు వచ్చాయి. ఈ వైద్యురాలి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో సేవలు అందిస్తోది. పైగా, కరోనా రోగులకు వైద్యం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఇంటి యజమాని... ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. 
 
ఆమె ఓ మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో డాక్టర్ స్విగ్ధా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఉంటోన్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని, తన సామగ్రిని తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలో పెట్టుకోవాలని వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆమె తెలిపింది. 
 
ఈ విషయాన్ని ఆమె తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. ఇలా బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments