Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇల్లు ఖాళీ చేసి సామాగ్రిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లు : లేడీ డాక్టర్‌కు బెదిరింపు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (13:59 IST)
కరోనా వైరస్ బారినపడుతున్న రోగులకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు, ఇతర సహాయక సిబ్బంది లేనిపోని సమస్యల్లో పడుతున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్ళలో నివసించే వారికి ఆ గృహ యజమానుల నుంచి బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. వైద్యులను బెదిరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
తాజాగా సికింద్రాబాద్ నగరంలో స్విగ్దా అనే మహిళా వైద్యురాలికి గృహ యజమాని నుంచి తీవ్ర వేధింపులు వచ్చాయి. ఈ వైద్యురాలి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో సేవలు అందిస్తోది. పైగా, కరోనా రోగులకు వైద్యం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఇంటి యజమాని... ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. 
 
ఆమె ఓ మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో డాక్టర్ స్విగ్ధా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఉంటోన్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని, తన సామగ్రిని తీసుకెళ్లి గాంధీ ఆసుపత్రిలో పెట్టుకోవాలని వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆమె తెలిపింది. 
 
ఈ విషయాన్ని ఆమె తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. ఇలా బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments