హైదరాబాద్‌లో దారుణం.. రూ.పది కోసం హత్య చేశారా..?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (08:12 IST)
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. పది రూపాయల కోసం దుండగులు ఓ పండ్ల వ్యాపారిని అతి దారుణంగా హత్య చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ హత్యను పోలీసులు చేధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షకీబ్ అలీ ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలసవచ్చాడు. కూకట్‌పల్లి తులసీనగర్ పరిధిలో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం ప్రగతి నగర్ రోడ్డులో తోపుడి బండిపై పండ్లు విక్రయిస్తుంటాడు.
 
అయితే జనవరి 1వ తేదీన నసీం అనే వ్యక్తి షకీబ్‌వలీ వద్దకు వచ్చి కిలో ద్రాక్ష పండ్లు కొనుగోలు చేశాడు. కిలో ద్రాక్షకు రూ.30 అని చెప్పగా.. నసీం 20 రూపాయలు మాత్రమే ఇచ్చి షకీబ్‌అలీతో వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
 
దీంతో నసీం తన ఐదుగురు స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి రప్పించాడు. అనంతరం వారు షకీబ్అలీ కడుపులో ఇనుపస్టాండ్‌తో బలంగా కొట్టారు. గాయాలతో ఉన్న అతడిని అక్కడే వదిలేసి పారిపోయారు. 
 
ఇక, షకీబ్‌అలీని ఆస్పత్రిలో చేర్పించగా.. జనవరి 3వ తేదీన చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు సెల్‌ఫోన్‌లో తీసిన వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ అంటున్న చిత్ర యూనిట్

Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్

Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా

G.V. Prakash Kumar: మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో : జివి ప్రకాష్ కుమార్

రవీంద్ర తేజ్, అరియా మోడీ ప్రేమికులుగా లవ్‌ వాలా మూవీ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

ఖాళీ కడుపుతో లవంగాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి?

పిల్లలు కనమంటే నో చెప్తున్న రష్యా మహిళలు.. వ్లాదిమిర్ పుతిన్‌కు తలనొప్పి

తర్వాతి కథనం
Show comments