Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మంటలు - బోగీ పూర్తిగా దగ్ధం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (10:01 IST)
సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చివరి బోగీలో మంటలు చెలరేగాయి. భువనగిరి దగ్గరలోని పగిడిపల్లి మధ్య శనివారం అర్థరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు చివరి బోగీలో ఈ మంటలు కనిపించాయి. ఇది లగేజీ బోగీ అని రైల్వే అధికారులు తెలిపారు. మంటలను గమనించిన సిబ్బంది డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. 
 
అయితే, చివరి బోగీ కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక దళ సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments