Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. భార్యను చంపేశాడు.. ఆపై ప్రియురాలి భర్తను కూడా..?

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (11:14 IST)
ఓ వ్యక్తితో పాటు మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన మహిళ మరణాన్ని హత్యగా తేల్చేశారు పోలీసులు. ఈ రెండు హత్యలకు వివాహేతర సంబంధమే కారణం. పక్కా ప్లాన్ ప్రకారం వివాహేతర సంబంధంలో వున్న ఆ ఇద్దరు మూడు నెలల క్రితం భార్యను ప్రియుడు హత్య చేస్తే.. ప్రియుడి సాయంతో ప్రియురాలు భర్తను హత్య చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్రవారం వెల్లడించారు. చివ్వెంల మండలం కుడకుడలో భూక్య వెంకన్న-రమాదేవి దంపతులు నివసిస్తున్నారు. షేక్ రఫీ-నస్రీన్ అద్దె ఇంట్లో ఉంటున్నారు. రఫీ భార్య నస్రీన్‌తో వెంకన్నకు వివాహేతర సంబంధం ఉంది. 
 
ఈ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అయితే తమ వివాహేతర సంబంధానికి భార్య రమాదేవి అడ్డుగా ఉందని, భర్త రఫీ అడ్డుగా ఉన్నారని వెంకన్న, నస్రీన్‌లు భావించారు. భార్యాభర్తల అడ్డంకి తొలగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. 
 
జులై 8న రాత్రి వెంకన్న తన భార్య రమాదేవితో కలిసి బైక్‌పై సూర్యాపేటకు బయల్దేరి మూత్ర విసర్జన చేస్తానంటూ చందుపట్ల సమీపంలో బైక్‌ను ఆపాడు. దీంతో రమాదేవి తల విద్యుత్ స్తంభానికి బలంగా కొట్టింది.
 
 ఆమె చనిపోయింది. దీన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు. 
 
వెంకన్న బైక్‌ను కింద పడవేయడంతో కాళ్లు, చేతులు దెబ్బతిన్నాయి. ఆ గాయాలతో రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. రోడ్డు ప్రమాదంలో రమాదేవి చనిపోయిందని అందరూ భావించారు. దీంతో వెంకన్న నస్రీన్‌తో కలిసి రఫీని చంపేందుకు పథకం వేశాడు. 
 
వెంకన్న తన స్నేహితులైన మోతె మండలం సిరికొండకు చెందిన జూనియర్ లైన్‌మెన్ అక్కనపల్లి శ్రీశైలం, నామవరం గ్రామానికి చెందిన సరగండ్ల మధులకు సమాచారం అందించాడు. ఈ నెల 9న రఫీ ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. నస్రీన్ వెంకన్నకు విషయం చెప్పింది. 
 
వెంకన్న తన స్నేహితులు శ్రీశైలం, మధుతో కలిసి నస్రీన్ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో రఫీ మద్యం తాగి ఇంటికి రాగానే వెంకన్న, శ్రీశైలం, మధు గొంతుకోసి హత్య చేశారు. రఫీ మెడకు చీర కట్టి ఫ్యాన్‌కు వేలాడదీశారు. 
 
మరుసటి రోజు నస్రీన్ రఫీ ఉరివేసుకుని చనిపోయాడని బంధువులకు, పోలీసులకు సమాచారం అందించింది. రఫీ శరీరంపై గాయాలు ఉన్నాయని పోస్ట్‌మార్టం నివేదిక రావడంతో పోలీసులు నస్రీన్‌ను ప్రశ్నించారు. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వెంకన్న, నస్రీన్, మధు, శ్రీశైలంలను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments