సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద భారీ పేలుడు!

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (11:18 IST)
దసరా పండుగ వేళ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పేలుడు స్థానికంగా కలకలం రేపింది. ఆలయం వద్ద ఉన్న చెత్తకుప్పలో వ్యర్థాలను తొలగించేందుకు వచ్చిన ఓ వ్యక్తి, దానిలో కనిపించిన పెయింట్ డబ్బాను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, భారీ శబ్దంతో అది పేలింది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలు అయ్యాయి. ఆయన్ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. డబ్బాలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పేలింది ఓ టిన్నర్ డబ్బా అని ప్రాథమికంగా తేల్చారు. దసరా పండగ నాడు ఈ ఘటన జరగడంతో, ఆలయంలోని భక్తులతో పాటు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జరిగిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. చెత్తకుప్పలో ఉన్న పెయింట్‌ డబ్బా పేలిందని పోలీసులు గుర్తించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments