Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్‌ కళాశాలలను లక్ష్యంగా చేసుకున్న ఎక్స్‌లెన్సియా ఇన్ఫినిటమ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (16:12 IST)
పదిహేను నుంచి 18 సంవత్సరాల నడుమ వయసు చిన్నారులకు కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో, ఎక్స్‌లెన్సియా ఇన్ఫినిటమ్‌ తమ మొదటి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను 07జనవరి 2022 న ప్రారంభించింది. ఈ డ్రైవ్‌తో ఎక్స్‌లెన్సియా జూనియర్‌ కళాశాలల ఈసీఐఎల్‌ మరియు సుచిత్ర శాఖలలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు.

 
ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను కీసరలోని  ప్రాధమిక ఆరోగ్య కేంద్రం భాగస్వామ్యంతో నిర్వహించారు. ఎక్స్‌లెన్సియా జూనియర్‌ కళాశాల, ఈసీఐఎల్‌కు చెందిన 230 మంది డే స్కాలర్‌ విద్యార్థులలో 147 మందికి విజయవంతంగా వ్యాక్సిన్‌ వేశారు. కోవిడ్‌ మార్గదర్శకాన్నీ అనుసరించడంతో పాటుగా తగిన భద్రతా చర్యలను తీసుకుని విజయవంతంగా ఈ డ్రైవ్‌ను ఇనిస్టిట్యూషన్‌ నిర్వహించింది.

 
ఈ సందర్భంగా ఎక్స్‌లెన్సియా ఇనిస్టిట్యూషన్స్‌ ఫౌండర్‌-డైరెక్టర్‌ వెంకట్‌ మాట్లాడుతూ, ‘‘ మా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ టీకా కార్యక్రమం నిర్వహించాము. కోవిడ్‌ 19 కారణంగా ఇప్పటికే సాధారణ విద్యా జీవితం ప్రభావితమైంది. ఓ ఇనిస్టిట్యూట్‌గా మా ప్రధాన లక్ష్యమేమిటంటే భద్రతా ప్రమాణాలను తప్పనిసరి చేయడంతో పాటుగా వ్యాక్సిన్‌లను సురక్షిత వాతావరణంలో మా విద్యార్థులకు అందుబాటులో ఉంచడం. తద్వారా సంప్రదాయ తరగతులు తిరిగి తీసుకురావడం మరియు కాలేజీలు, పాఠశాలలు తిరిగి పనిచేసేలా చేయడం. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మేనేజ్‌మెంట్‌ తమ వంతు తోడ్పాటునందిస్తుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments