Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలోకు ఈటల రాజేందర్ తరలింపు : నిలకడగా ఆరోగ్యం

Webdunia
శనివారం, 31 జులై 2021 (15:05 IST)
తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో బీజేపీ శ్రేణులు, అభిమానులు పూజలు నిర్వహించారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల వ్యాప్తంగా పూజలు, అర్చనలు చేశారు. 
 
అయితే తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆందోళన చెందవద్దని.... అతి త్వరలోనే ప్రజాదీవెన యాత్రతో వస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని... వైద్య పరీక్షల తరువాత పూర్తి సమాచారం అందిస్తామని ఈటల కుటుంబసభ్యులు తెలియజేశారు. 
 
మరోవైపు, ఈటల రాజేందర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో ఈటలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, వివేక్‌ పరామర్శించారు. 
 
కాగా హుజురాబాద్‌ ఉప ఎన్నికల నేపత్యంలో వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. ఆరోగ్య రీత్యా పాదయాత్రను నిలిపివేయాలని ఈటలను వైద్యులు కోరారు. 
 
అయితే ఈటల మాత్రం పాదయాత్ర కొనసాగిస్తామన్నారని తెలిపారు. ఈటల కష్టపడి పాదయాత్ర చేస్తుంటే.. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి అక్రమ పద్ధతిలో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని సంజయ్‌ మండి పడ్డారు. బండి సంజయ్ వెంట జి.వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments