Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రబెల్లి, కడియం పరస్పర విమర్శలు ఎందుకు...

Webdunia
మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (08:52 IST)
వరంగల్ జిల్లా జడ్.పి. సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ నాయకుడు కడియం శ్రీహరిలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. నువ్వా నేనా అంటూ పోటాపోటీగా అరుచుకున్నారు. ఎంపీ కడియం, ఎర్రబెల్లి మధ్య ఎరువుల కొరతపై చర్చ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. టిఆర్ఎస్ పార్టీలో చేరతానని తనకు ఫోన్ చేయలేదా? అని కడియం అనడంతో మరింత వేడెక్కింది.
 
రాజకీయాలకు ఇది వేదిక కాదని ఎర్రబెల్లి.. కడియంకు సూచించారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎర్రబెల్లి తాను టిడిపిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments