Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్‌తో తెలంగాణ గౌరవం మంటగలిసింది : ఎర్రబెల్లి దయాకర్

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (15:19 IST)
చట్ట వ్యతిరేకంగా టెలిఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంటగలిపారంటూ టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు తెరాస ప్రభుత్వ చర్యలతోనే నిరూపితమైందన్నారు. అందువల్ల దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి, యావత్ తెలంగాణ గౌరవాన్ని మంటగలిపినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇప్పటికీ కూడా వివిధ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఒక రోజు నిరాహారదీక్ష చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments