Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైద‌రాబాద్‌లో ప‌టిష్టంగా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:35 IST)
జిహెచ్ఎంసి ఎన్నిక‌ల ప్రకటన నేప‌థ్యంలో నేటి నుండి అమలులోకి వచ్చిన ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిలో భాగంగా  గ్రేటర్ హైదరాబాద్ లో  4 వేల‌కు పైగా పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు తొల‌గించిన‌ట్టు జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి, క‌మిష‌న‌ర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారిగా ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిని ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. తక్షణమే నగరంలో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

నేడు తొలగించిన ప్లెక్సీలు, బ్యానర్లలో ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, భ‌వ‌నాలు, ప్ర‌హ‌రీగోడ‌లు, ప్రధాన రహదారుల వెంట తొలగించినట్లు పేర్కొన్నారు. న‌గ‌రంలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లు చేయ‌డానికి సర్కిళ్లవారిగా నిఘా బృందాల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేశామ‌ని డి.ఎస్.లోకేష్ కుమార్ వివ‌రించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments