Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క తెలంగాణాలోనే రూ.659 కోట్లు.. మిగిలిన రాష్ట్రాల్లో ఎంతంటే...

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (08:25 IST)
వచ్చే యేడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసింది. అయితే, ఈ ఎన్నికల్లో ఓటర్లు ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు నగదును ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. ఓటరుకు డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేసి గెలుపొందాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఫలితంగా ఈ ఐదు రాష్ట్ర ఎన్నికల్లో ధనం ఏరులై పారింది. 
 
భారత ఎన్నికల సంఘం ఈ నెల 20వ తేదీ నాటికి ఈ ఐదు రాష్ట్రాల్లో ఏకంగా రూ.1,760 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొంది. ఇందులో రూ.659.2 కోట్ల సొత్తును ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో రూ.650.7 కోట్లతో రాజస్థాన్ ఉంది. మొత్తం అయిదు రాష్ట్రాల్లో కలిపి రూ.372.9 కోట్ల నగదును స్వాధీనం చేసుకోగా అందులో 60 శాతం తెలంగాణలోనే లభించింది. మద్యం, డ్రగ్స్, విలువైన లోహాల స్వాధీనంలోనూ తెలంగాణే తొలిస్థానాన్ని ఆక్రమించింది. 
 
ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో 2018 ఎన్నికల సమయంలో దొరికిన రూ.239.15 కోట్లతో పోలిస్తే ఈసారి ఇప్పటివరకు దొరికిన సొత్తు విలువ 636 శాతం అధికంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల కంటే ముందు జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, కర్ణాటక ఎన్నికల్లో రూ.1,400 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నామని.. అది ఆయా రాష్ట్రాల్లో అంతకు ముందు ఐదేళ్ల కిందట స్వాధీనం చేసుకున్న మొత్తంతో పోలిస్తే 1009.12 శాతం అధికమని ఈసీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments