తెలంగాణాలోని గ్రానైట్ కంపెనీల్లో ముమ్మరంగా ఐటీ - ఈడీ సోదాలు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (16:02 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రానైట్ కంపెనీల యజమానుల గృహాల్లో ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూకుమ్మడిగా సోదాలకు దిగారు. ఈ కంపెనీలు విదేశీ మారకద్రవ్య చట్టం ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు దిగారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు దాదాపు 30 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్‌లో ఈ సోదాలు చేశారు. 
 
ఐటీ శాఖ అధికారులు తోడుగా హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ, అత్తాపూర్‌లో పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగరులోని గ్రానైట్ వ్యాపాలే లక్ష్యంగా ఈ సోదాలు చేస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
మరోవైపు, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు. కరీంనగర్‌లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మతోటలో ఉన్న కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
గ్రానైట్ రాళ్ల ఎగుమతుల్లో భాగంగా పలు గ్రానైట్ కంపెనీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే ఎనిమిది సంస్థలకు ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments