Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలోని గ్రానైట్ కంపెనీల్లో ముమ్మరంగా ఐటీ - ఈడీ సోదాలు

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (16:02 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రానైట్ కంపెనీల యజమానుల గృహాల్లో ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూకుమ్మడిగా సోదాలకు దిగారు. ఈ కంపెనీలు విదేశీ మారకద్రవ్య చట్టం ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో ఐటీ, ఈడీ అధికారులు సోదాలకు దిగారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారులు దాదాపు 30 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్‌లో ఈ సోదాలు చేశారు. 
 
ఐటీ శాఖ అధికారులు తోడుగా హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ, అత్తాపూర్‌లో పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగరులోని గ్రానైట్ వ్యాపాలే లక్ష్యంగా ఈ సోదాలు చేస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
మరోవైపు, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిలోనూ సోదాలు చేస్తున్నారు. కరీంనగర్‌లోని గంగుల ఇంటితో పాటు మంకమ్మతోటలో ఉన్న కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
గ్రానైట్ రాళ్ల ఎగుమతుల్లో భాగంగా పలు గ్రానైట్ కంపెనీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలతో ఇదివరకే ఎనిమిది సంస్థలకు ఈడీ నోటీసులు జారీచేసిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments