Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్‌గా మారిన తెరాస.. నేడు దివ్య ముహూర్తంలో ఆవిర్భావ సభ

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (10:47 IST)
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని ఆ తర్వాత రాజకీయ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇపుడు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెరాసను బీఆర్ఎస్‌ పేరు మార్చి గుర్తింపునిచ్చింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఒక లేఖ కూడా రాసింది. దీంతో శుక్రవారం ఓ దివ్య ముహూర్తంలో ఆవిర్భావ సభలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు. 
 
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు దివ్య ముహూర్తంలో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖపై సీఎం కేసీఆర్ కూడా సంతకం చేయనున్నారు. ఆ మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ ఉనికిలోకి వస్తుంది. తెరాస కనుమరుగవుతుంది. 
 
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం ర్వాత పార్టీ కార్యాచరణపై ఆయన కీలక నేతలతో చర్చలు జరుపుతారు. అలాగే, బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు ఇలా ప్రతి ఒక్కరూ హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments