Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ జిల్లాల్లో భూకంప వదంతులు... రాత్రంతా రోడ్లపైనే జాగారం!

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (09:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించినట్టుగా వదంతులు పుట్టుకొచ్చాయి. దీంతో ఈ జిల్లాల వాసులు రోడ్లపైనే జాగారం చేశారు. మళ్ళీ భూకంపం వస్తుందన్న భయంతో తాము ఇళ్ళలోకి వెళ్ళడానికి భయపడ్డారు. ఈ భూకంపం పుకార్లు ఫోన్ల ద్వారా వ్యాపించినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ఏ ప్రాంతంలో కూడా భూకంపం రాలేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
 
దీనికి తోడు భూకంప పుకార్లు సెల్ఫోన్ల ద్వారా మూరుమూల గ్రామాలకు పాకి పోవటంతో ఎవరికి వారు తమ బంధువులకు ఫోన్లు ద్వారా సమాచారం అందించారు. దాంతో వారు కూడా నిద్ర పోకుండా జాగారం చేశారు. కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భూకంప వదంతులు షికార్లు చేశాయి. కాగా భూకంప వదంతులను ఆ శాఖ కొట్టిపారేసింది. వదంతులు నమ్మవద్దని ప్రజలకు సూచించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments