Webdunia - Bharat's app for daily news and videos

Install App

23వ తేదీ నుంచి దుబాయ్ విమాన సర్వీసులు

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (05:40 IST)
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్‌తో తమ విమాన సర్వీసులను పునరుద్ధరించబోతోన్నట్లు ప్రకటించింది. ఈ నెల 23వ తేదీ నుంచి భారత్ నుంచి తమ దేశానికి విమానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. నిజానికి యూఏఈ తీసుకున్న నిర్ణయం ప్రకారం విమాన సర్వీసులపై నిషేధం జులై 6వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.
 
కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో షరతులతో కూడిన ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. తమ దేశానికి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ.. భారత్‌లోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలను నడిపించనున్నట్లు దుబాయ్ సుప్రీం కమిటీ ఆఫ్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభం కావడానికి ముందు నాటి పరిస్థితులకు అనుగుణంగా విమాన సర్వీసులు ఉంటాయని హామీ ఇచ్చింది ఎమిరేట్స్.
 
వ్యాలిడ్ రెసిడెన్స్ విసా ఉండి, యూఏఈ అప్రూవ్ చేసిన వ్యాక్సిన్ల రెండు డోసులను తీసుకున్న ప్రయాణికులకు తాము అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే- ప్రయాణికులు 48 గంటలు ముందుగా తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments