Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబుల నుంచి రూ.1.99 కోట్లు స్వాధీనం

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (13:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో మందుబాబుల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. మందుబాబులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫలితంగా భారీగా అపరాధం విధిస్తున్నారు. మద్యం తాగి వాహ‌నాలు న‌డ‌పకూడ‌ద‌ని పోలీసులు ఎంత‌గా ప్రచారం చేస్తున్న‌ప్పటికీ మందుబాబులు వినిపించుకోవ‌ట్లేదు. 
 
గ‌త నెల‌లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసుల‌ను న‌మోదు చేశారు. అదేస‌మ‌యంలో భారీగా జ‌రిమానాల‌ను వ‌సూలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1,917 మందిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వివ‌రించారు.
 
వారిలో కోర్టు 58 మందికి రెండు రోజుల‌ నుంచి తొమ్మిది రోజుల వరకు జైలు శిక్ష విధించింది. మిగతా 1,859 మంది నుంచి రూ.1,99,56,300 జరిమానాను వసూలు చేశారు. 
 
మోతాదుకి మించి మద్యం తాగ‌డం, ప‌దే ప‌దే నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ ముగ్గురికి తొమ్మి రోజుల జైలు శిక్ష ప‌డింది. ప‌ది మందికి ఏడు రోజులు, 25 మందికి ఐదు రోజులు, 20 మందికి రెండు రోజుల జైలు శిక్షను విధించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments