Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరుణ్ షాకింగ్ సంగతులు... డ్రగ్స్ కోసం సినిమా వాళ్లకు సీక్రెట్ గదులు...

డ్రగ్స్ కేసు విచారణలో హీరో తరుణ్ షాకింగ్ సంగతులు చెపుతున్నట్లు తెలుస్తోంది. సిటీలో వున్న 19 ప్రధాన పబ్ సెంటర్లకు గాను 15 పబ్బుల్లో మాదక ద్రవ్యాలు యధేచ్చగా లభ్యమవుతున్నాయని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. తను పబ్ ప్రారంభించిన కొత్తల్లో సర్వీస్ బాయ్స్ డ

Webdunia
శనివారం, 22 జులై 2017 (22:31 IST)
డ్రగ్స్ కేసు విచారణలో హీరో తరుణ్ షాకింగ్ సంగతులు చెపుతున్నట్లు తెలుస్తోంది. సిటీలో వున్న 19 ప్రధాన పబ్ సెంటర్లకు గాను 15 పబ్బుల్లో మాదక ద్రవ్యాలు యధేచ్చగా లభ్యమవుతున్నాయని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. తను పబ్ ప్రారంభించిన కొత్తల్లో సర్వీస్ బాయ్స్ డ్రగ్స్ సమకూర్చేవారని వెల్లడించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద డ్రగ్స్ కేసులో పబ్బుల గుట్టును విప్పేస్తున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు విచారణ మొదలు పెట్టి మూడురోజులు కాలేదు. అప్పుడే అంతర్జాతీయ మాఫియా నుంచి బెదిరింపు కాల్ వచ్చేసింది. నేరుగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌కు కాల్ చేసిన మాఫియా దుండుగులు ఆఫ్రికన్ భాషలో దూషిస్తూ బెదిరించారు. ఉన్నఫళంగా విచారణ నిలిపేయకపోతే నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ బెదిరించారు. హైదరాబాద్‌లో లాగిన తీగ అంతర్జాతీయ మాఫియా డొంకంతా కదిల్చినట్లు స్పష్టమవుతోంది. వారంరోజులుగా అకున్ సబర్వాల్‌కు ఇదేవిధమైన బెదిరింపులు వస్తున్నాయని తెలుస్తోంది.
 
తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్‌ వ్యవహారం అంతు తేల్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. డ్రగ్స్‌ విచారణ ఉన్నపలంగా నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు కాల్‌ చేసి హెచ్చరికలు చేశారు. అకున్‌ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ బెదిరించారు. ఇంటర్నెట్‌ ద్వారా అగంతుకుడు ఫోన్‌ చేశాడు. ఫోన్‌ చేసిన డ్రగ్స్‌ మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్‌ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వారం రోజులుగా కూడా ఆయనకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయంట. దీంతో డ్రగ్స్‌ మాఫియా వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు మొదలయ్యాయి. 
 
ఇప్పటికే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌ ముఠా నెదర్లాండ్‌, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్‌ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్‌ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్‌ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది. దీంతో డ్రగ్స్‌ మాఫియా తాజాగా చేసిన ఫోన్‌ కాల్స్‌పై ఇంటెలిజెన్స్‌ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. 
 
ఈ కేసును విచారిస్తున్న సిట్‌ అధికారులు ఇప్పటి వరకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, కెమెరామేన్‌ శ్యామ్‌కే నాయుడు, నటుడు సుబ్బరాజును విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15 మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు. తరుణ్‌ విచారణలో కీలక సంగతులు వెల్లడవుతున్నాయి. ఇంకోవైపు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం రాత్రి హైదరాబాదులోని పబ్ సెంటర్ల ముందు ఆందోళనకు దిగారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments