Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిందని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు.. శ్మశానికి తీసుకెళ్తుంటే కళ్లు తెరిచింది...

బరువు తక్కువుతో జన్మించిన ఓ ఆడశిశువు చనిపోయిందని నిర్ధారిస్తూ వైద్యులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దీంతో అంత్యక్రియలు చేసేందుకు శ్మశానికి తీసుకెళుతుంటే ఆ శిశువు కళ్లు తెరిచింది. దీంతో ఒక్కసారి అవాక్కైన

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (16:48 IST)
బరువు తక్కువుతో జన్మించిన ఓ ఆడశిశువు చనిపోయిందని నిర్ధారిస్తూ వైద్యులు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దీంతో అంత్యక్రియలు చేసేందుకు శ్మశానికి తీసుకెళుతుంటే ఆ శిశువు కళ్లు తెరిచింది. దీంతో ఒక్కసారి అవాక్కైన తల్లిదండ్రులు.. వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన ఈ ఆశ్చర్యకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని పెగడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, స్వప్న దంపతులకు బరువు తక్కువతో ఓ శిశువు జన్మించింది. దీంతో చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మూడు రోజులు చికిత్స తర్వాత పాప చనిపోయిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రాణాలతో ఉన్న మూడు రోజుల పసికందు చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. 
 
చిన్నారి మృతి చెందిందని మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారు వైద్యులు. ఈ క్రమంలో పాపను అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. చిన్నారి కదలడం చూసి మళ్లీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. పసికందుకు వైద్యులు మళ్లీ చికిత్స అందిస్తున్నారు. వైద్యుల తీరుపై పాప కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments