Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాజ్‌భవన్‌ సిబ్బంది కోసం గవర్నర్‌ ఏం చేశారో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (07:46 IST)
రాజ్​భవన్​ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ రాజ్​భవన్​లోని సంక్షేమ భవన్​లో యోగా తరగతులను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్యకృత్యంగా మార్చుకోవాలని సూచించారు.

హైదరాబాద్ రాజ్‌భవన్​లోని సంక్షేమ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యోగా తరగతులను ప్రారంభించారు. రాజ్‌భవన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతుల్లో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు.

ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు నిర్వహించిన ఆ యోగా తరగతుల్లో గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, సలహాదారు ఏపీవీఎన్ శర్మతో పాటు సుమారు 200 మంది సిబ్బంది కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రతిరోజూ యోగా చేద్దాం: గవర్నర్ ప్రతి రోజు యోగా తరగతుల్లో పాల్గొనాలని గవర్నర్ కోరారు. ప్రధాని పిలుపుచ్చిన 'ఫిట్ ఇండియా' ఉద్యమానికి బలం చేకూరేలా ప్రతి రోజు అందరం యోగా చేద్దామన్నారు.

రాజభవన్‌ స్కూల్‌లో 6 నుంచి 10వ వరకు చదువుతున్న 450 మంది విద్యార్థులకు ప్రతి శనివారం ఈ అంశంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తమిళిసై వివరించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments