Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడ చంపండ్రి: నిందితుడి భార్య

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:14 IST)
దిశ హత్య నిందితులు శుక్రవారం ఉదయం పోలీసుల చేతుల్లో ఎన్ కౌంటర్లో మరణించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు ఒక్కసారిగా పోలీసులపైన ఎదురు దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసులపై దాడి చేసి పారిపోతున్న నిందితులను పోలీసులు కాల్చి చంపారు.
 
ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మానవ హక్కుల కమీషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు నిందితుడు భార్య, గర్భవతి అయిన మహిళ కళ్ల నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడా చంపండ్రి, మా ఆయన లేనిదే నేను బతకలేను అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 
 
కాగా దిశను అత్యాచారం చేసి అతి దారుణంగా హతమార్చిన నిందితులకు సరైన శిక్ష పడిందని టాలీవుడ్ ఇండస్ట్రీ అంటోంది. తెలంగాణలో దిశ ఇంటి వద్ద స్వీట్లు పంచుకుని, బాణాసంచా పేల్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం