Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు గులాబీ అంగీలు తొడుక్కున్నరా? : డీకే అరుణ

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:07 IST)
దుబ్బాక  బీజేపీ అభ్యర్థిపై జరుగుతున్న దాడుల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర బలగాలను భద్రత కోసం పంపాలన్నారు.

హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దుబ్బాకలో టీఆర్​ఎస్ పై వ్యతిరేకత ఉందని, అందుకే  ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ చూస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ ఇంటితో పాటు బంధువులు ఇండ్ల పై పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

‘‘పోలీసులు గులాబీ చొక్కాలు తొడుక్కున్నరా.. టీఆర్​ఎస్​ కండువాలు వేసుకున్నరా పోలీసుల వెహికల్స్ లో డబ్బులు పంపుతున్నరు. కాలం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదనే విషయం గుర్తించుకోవాలి అని ఆమె హెచ్చరించారు.

పోలీసులంటే ప్రజలు అస్యహించుకునేలా చేసుకోవద్దన్నారు. బీజేపీ గెలుస్తుందని సర్వేల్లో తెలుసుకున్న టీఆర్ ఎస్ అడ్డదారులు తొక్కుతున్నదని,  మంత్రి హరీశ్​ వ్యవహార శైలి సరిగా లేదని, ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారన్నారని మండిపడ్డారు.

ఎన్నికలు సరిగా జరిగేలా కనిపించడం లేదన్నారు. కేసీఆర్ ఆహంకారం తగ్గాలంటే దుబ్బాక లో బీజేపీని  గెలిపించాలని, టీఆర్​ఎస్​కు బుద్ధి చెప్పాలని, ఒక చారిత్రక తీర్పు దుబ్బాక ఓటర్లు ఇవ్వాలని డీకే అరుణ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments