Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితబంధు నిధులు విడుదల.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (16:58 IST)
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని తన దత్తత గ్రామం వాసాలమర్రికి దళితబంధు నిధులు విడుదల చేశారు. దళితబంధు అమలుపై ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున వాసాలమర్రివాసులకు దళితబంధు పథకం తొలి ప్రయోజనం అందనుంది. 
 
మొత్తం గ్రామంలో 76 దళిత కుటుంబాలు ఉండగా వారికి రూ.7.60 కోట్లు విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో వాసాల మర్రి గ్రామంలో పండగ మొదలైంది. 
 
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. దీంతో వాసాలమర్రిలో బతుకమ్మ పండుగ ముందే వచ్చింది. మహిళలు బతుకమ్మ ఆడుతూ అందులోనే మునిగి తేలుతున్నారు. ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకున్నందుకు కేసీఆర్ కు గ్రామస్తులు కృతజ్ణతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments