Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతగూటికి చేరిన ధర్మపురి శ్రీనివాస్... మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు..

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (14:30 IST)
ధర్మపురి శ్రీనివాస్.. ఒకపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. పీసీసీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పని చేశారు. ముఖ్యంగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆయన ఉమ్మడి ఏపీతో పాటు కాంగ్రెస్ పార్టీని శాసించారు. డీఎస్‌ గతంలో కాంగ్రెస్‌లో కీలక పదవులు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో పార్టీ 2004, 2009లో అధికారంలో ఉన్నప్పుడు డీఎస్‌ మంత్రిగా సేవలందించారు.
 
రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసలో చేరిన డీఎస్‌.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆ పార్టీలో ఆయనకు సరైన ఆదరణ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో డీఎస్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. 
 
డీఎస్‌తో పాటు ఆయన తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments