Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత విషమంగా ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం... ఐసీయూలో అడ్మిట్

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (12:28 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆయన సోమవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తన అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే.
 
గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో పాటు పక్షవాతంతో బాధపడుతున్నారు. తాజాగా యూరిన్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. 
 
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అయితే, పార్టీ అధినాయకత్వంతో ఏర్పడిన విభేదాలు ఉన్నప్పటికీ ఆ పార్టీలోనే కొనసాగుతూ, యాక్టివ్‌గా ఉండటం లేదు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. ఈ తరుణంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. డీఎస్ చిన్న కుమారుడు డి.అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments