డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించిన ఎస్ఐ.. అరెస్టు

Webdunia
ఆదివారం, 27 ఆగస్టు 2023 (20:11 IST)
స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో కొంత మేరకు దాచిపెట్టి.. దాన్ని విక్రయించేందుకు ప్రయత్నించి ఓ ఎస్‌ఐను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో రాజేందర్ అనే వ్యక్తి ఎస్ఐగా పని చేస్తున్నాడు. ఈయన స్మగ్లర్ల వద్ద పట్టుబడిన డ్రగ్స్‌లో సుమారు 1750 గ్రాముల వరకు దాచిపెట్టి రహస్యంగా విక్రయించేందుకు ప్రయత్నించాడు. 
 
దీనిపై నగరంలోని నార్కోటిక్ విభాగం అధికారులకు పక్కా సమాచారం అందండంతో వారు వలపన్ని రాజేందర్‌ను అతడి ఇంట్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత నార్కోటిక్ విభాగం అధికారులు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) డైరెక్టర్, సీపీ సీవీ ఆనంద్‌కు నివేదిక ఇచ్చారు. అనంతరం నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించడంతో వారు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
 
రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన రాయదుర్గం ఎస్ఐగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అప్పట్లో అతడిని సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆ ఉత్వర్వులపై కోర్టు నుంచి రాజేందర్ స్టే తెచ్చుకున్నారు. ఈ తర్వాత సైబరాబాద్ సీసీఎస్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments