ముచ్చటగా ముగ్గురిని పెళ్లాడిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (17:16 IST)
ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ముచ్చటగా ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. అదీ కూడా ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఏకంగా ముగ్గురుని వివాహం చేసుకున్నారు. ఇది హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సహారా ఎస్టేట్‌లోని గాంధార అపార్ట్‌మెంట్‌లో నివాసముండే ఎడ్ల శంకరయ్య (39) సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ 2011లో ఓ మహిళను పెళ్లాడాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమెను వదిలివేశాడు. 
 
ఆ తర్వాత 2016లో శారద (38) అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. యేడాది తర్వాత వీరికి ఓ పాప జన్మించింది. శంకరయ్యకు ఇటీవల బదిలీ అయింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో శారదకు దూరంగా ఉండసాగాడు. 
 
ఈ క్రమంలో గతేడాది నవంబరు 30న సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహించే మంజులారాణి అనే మహిళను లోబరుచుకుని తిరుపతిలో రహస్యంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు శారద వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శంకరయ్యను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి మూడు పెళ్లిళ్ళ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments