భారీ వర్షాలు, అకాల వడగళ్ల వానలు.. ఆరు జిల్లాల రైతులకు భారీ నష్టం

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (08:53 IST)
భారీ వర్షాలు, అకాల వడగళ్ల వానలతో తెలంగాణలోని ఆరు జిల్లాల రైతులు భారీగా నష్టపోయారు. ఒక్కరోజులోనే 50 మండలాల్లోని 650 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా పంట నష్టం వాటిల్లింది.
 
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని మైలార్ దేవులపల్లి, శివరాంపల్లిలో కూడా భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట, మర్పల్లి మండలాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
 
సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలాలతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వానతో పంటలన్నీ నేలకొరగడంతో పచ్చిమిర్చి బాగా దెబ్బతిన్నది. పలు జిల్లాల్లో మొక్కజొన్న, జొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
హైదరాబాద్ శివారు జిల్లాల్లో కూరగాయల రైతులు భారీగా నష్టపోయారు. టమాటా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ పంటలకు భారీగా నష్టం వాటిల్లగా, బొప్పాయి, పుచ్చకాయ తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

Jonnalagadda: స్టార్ డమ్ కోరుకుంటే రాదు, ప్రేక్షకులు ఇవ్వాలి : చైతన్య జొన్నలగడ్డ

Manchu Manoj : మోహన రాగ మ్యూజిక్ తో మంచు మ‌నోజ్‌

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments