Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి మర్మాంగంపై టపాసులు పేల్చారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (10:53 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఒక అమానుష ఘటన జరిగింది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన 16 యేళ్ల బాలుడి మర్మాంగంపై టపాసులు పేల్చిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీనగర్‌కు చెందిన 16 యేళ్ల బాలుడిని మూడు నెలల క్రితం నగరానికి ఉపాధి నిమిత్తం బంధువులు పంపించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసిరేగడి శివారులో జేఎస్‌డబ్ల్యూ రెడీమిక్స్ ప్లాంట్‌లో ఆ బాలుడు పని చేస్తున్నాడు. 
 
కాగా, కొన్ని రోజులుగా ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న తోటి యువకులు దీపావళి పండుగ రోజున బాలుడి మర్మాంగంపై టపాసులు పెట్టిన పేల్చారు. పైగా, ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియో బాధిత బాలుడి బంధువులు తిలకించడంతో ఈ విషయం కుటుంబీకులకు చేరింది. 
 
ఆ తర్వాత ఆ బాలుడికి ఫోన్ చేసి ఆరా తీయడంతో అది నిజమని తేలడంతో  బాలుడు తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కేసును మంగళవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments