Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి మర్మాంగంపై టపాసులు పేల్చారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (10:53 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఒక అమానుష ఘటన జరిగింది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన 16 యేళ్ల బాలుడి మర్మాంగంపై టపాసులు పేల్చిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీనగర్‌కు చెందిన 16 యేళ్ల బాలుడిని మూడు నెలల క్రితం నగరానికి ఉపాధి నిమిత్తం బంధువులు పంపించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసిరేగడి శివారులో జేఎస్‌డబ్ల్యూ రెడీమిక్స్ ప్లాంట్‌లో ఆ బాలుడు పని చేస్తున్నాడు. 
 
కాగా, కొన్ని రోజులుగా ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న తోటి యువకులు దీపావళి పండుగ రోజున బాలుడి మర్మాంగంపై టపాసులు పెట్టిన పేల్చారు. పైగా, ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియో బాధిత బాలుడి బంధువులు తిలకించడంతో ఈ విషయం కుటుంబీకులకు చేరింది. 
 
ఆ తర్వాత ఆ బాలుడికి ఫోన్ చేసి ఆరా తీయడంతో అది నిజమని తేలడంతో  బాలుడు తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కేసును మంగళవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments