Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో సాధారణ వైద్య సేవలు... ఖాళీ అవుతున్న కోవిడ్ పడకలు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (09:52 IST)
తెలంగాణా రాష్ట్రంలో సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. దీంతో కొవిడ్ ఆసుపత్రులలోని ఖాళీ పడకల సంఖ్య పెరుగుతోంది. 
 
ఆసుపత్రికి వచ్చే కరోనా రోగుల సంఖ్య పడిపోవడంతో ఆయా ఆసుపత్రుల్లో వారి కోసం కేటాయించిన పడకలను తిరిగి సాధారణ పడకలుగా మార్చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 91 శాతం కొవిడ్ పడకలు ఖాళీ అయ్యాయి.
 
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 55,442 కొవిడ్ పడకలు ఉండగా నిన్నటికి 4,931 (8.89) శాతం పడకలు మాత్రమే నిండాయి. మిగిలిన 50,511 (91.11 శాతం) పడకలు ఖాళీగా వున్నాయి. 
 
అలాగే, ఐసీయూ, వెంటిలేటర్ పడకలు కూడా ఖాళీ అవుతున్నాయి. 21,846 సాధారణ పడకల్లో 871.. 21,751 ఆక్సిజన్ పడకల్లో 2,266.. 11,845 ఐసీయూ పడకల్లో 1,794 బెడ్‌లలో రోగులు చికిత్స పొందుతున్నారు.
 
ఇక, 250 పడకలు ఉన్న చిన్న ఆసుపత్రులు కొవిడ్ కోసం కేటాయించిన బెడ్‌లను సాధారణ పడకలుగా మార్చేశాయి. బెడ్లు ఖాళీగా మారుతుండడంతో సాధారణ వైద్య సేవలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వాసుపత్రులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments