Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లో కరోన్ బాధితుడు ఆత్మహత్యాయత్నం

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (12:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఓ క్వారంటైన్‌లోని కరోనా బాధితుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ దృశ్యాన్ని చూసిన క్వారంటైన్ కేంద్ర సిబ్బంది ఆ బాధితుడిని ప్రాణాలతో రక్షించాడు. ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలోని అసిఫా బాద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కరోనా వైరస్ బాధితుల కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలోని ఓ వార్డుకు కరోనా పాజిటివ్‌ రోగిని అధికారులు తరలించారు. 
 
అయితే, ఆ వార్డులో ఉండేందుకు భయపడిన ఆ రోగి ... తనను మరో వార్డుకు మార్చాలని అధికారులను కోరారు. కానీ, అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆ రోగి వార్డులోనే ఉన్న చీరతో ఫ్యానుకు ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన వార్డులోని వైద్య సిబ్బందితో పాటు అతన్ని అడ్డుకొని మరో చోటికి తరలించారు.
 
కాగా, ఆసిఫాబాద్‌ జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఐదుకి చేరింది. తాజాగా ఆరేళ్ల బాలుడికి కూడా కరోనా పాటిజివ్‌ అని తేలింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 800 దాటింది. 
 
శనివారం రాత్రి నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  809కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 186 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 605గా ఉండగా, మొత్తం 18మంది మృత్యువాతపడ్డారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments