Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహస్యంగా ప్రేమ వివాహం, పెద్దల ఆశీర్వాదాల కోసం వస్తుండగా...

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (13:19 IST)
వారిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం పెద్దలకు చెబితే అంగీకరించరేమోనని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదాల కోసం స్వస్థలానికి బయలుదేరారు. ఐతే ఇంతలోనే వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
 
వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం మోడెగాం గ్రామానికి చెందిన 24 ఏళ్ల బ‌ట్టు స‌తీశ్, హైద‌రాబాద్‌లోని గండి మైస‌మ్మ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మ‌హిమ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్ హైదరాబాదులోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మహిమతో పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెబితే అంగీకరించరని రహస్యంగా వివాహం చేసుకున్నారు.
 
ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఆశీర్వాదాలు తీసుకుందామని బైక్ పైన వస్తుండగా సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. దీనితో మహిమ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. సతీశ్ ఆసుపత్రిలో చనిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments