Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసు క్రీస్తు వల్లే కరోనా వైరస్ లేకుండా పోయింది : తెలంగాణ హెల్త్ డైరెక్టర్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (08:22 IST)
తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు మరోమారు వార్తలకెక్కారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి పత్రిలకెక్కిన ఆయన తాజాగా మరోమారు వార్తల్లో నిలించారు. ఏసు క్రీస్తు వల్లే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేసిందన్నారు. ప్రపంచ మానవాళిని కోవిడ్ తీవ్రంగా భయపెట్టిందన్నారు. ఇపుడు దాని నుంచి పూర్తిగా విముక్తి కలిగిందని చెప్పారు. దీనికి కారణం ఏసు ప్రభువన్నారు. 
 
"మనం అందించిన వైద్య సేవలతో కాదు.. ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గింది. మంచిని ఆచరించాలని, మంచిని ప్రేమించాలని, మంచిని గౌరవించాలని చెప్పే మిగిలిన అన్ని జాతుల, ధర్మాల ప్రబోధాలను మనమందరం ముందుకు తీసుకుపోవడం వల్ల మానవజాతిని కాపాడుకోగలిగాం. మనిషిగా పుట్టేందుకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు" అని శ్రీనివాసరావు అన్నారు.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments