ఏసు క్రీస్తు వల్లే కరోనా వైరస్ లేకుండా పోయింది : తెలంగాణ హెల్త్ డైరెక్టర్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (08:22 IST)
తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు మరోమారు వార్తలకెక్కారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కి పత్రిలకెక్కిన ఆయన తాజాగా మరోమారు వార్తల్లో నిలించారు. ఏసు క్రీస్తు వల్లే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా కరోనా వైరస్ మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చివేసిందన్నారు. ప్రపంచ మానవాళిని కోవిడ్ తీవ్రంగా భయపెట్టిందన్నారు. ఇపుడు దాని నుంచి పూర్తిగా విముక్తి కలిగిందని చెప్పారు. దీనికి కారణం ఏసు ప్రభువన్నారు. 
 
"మనం అందించిన వైద్య సేవలతో కాదు.. ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గింది. మంచిని ఆచరించాలని, మంచిని ప్రేమించాలని, మంచిని గౌరవించాలని చెప్పే మిగిలిన అన్ని జాతుల, ధర్మాల ప్రబోధాలను మనమందరం ముందుకు తీసుకుపోవడం వల్ల మానవజాతిని కాపాడుకోగలిగాం. మనిషిగా పుట్టేందుకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు" అని శ్రీనివాసరావు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments