Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న 'తెల్ల బంగారం'

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (11:45 IST)
పత్తిని తెల్ల బంగారంగా పిలుస్తుంటారు. ఈ పత్తికి సరైన గిట్టుబాటు ధర లేక అనేక మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, ఇపుడు ఈ తెల్ల బంగారం ధర సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.9 వేలను టచ్ చేసింది. పుష్కలమైన వర్షాలతో దిగుబడి తక్కువగా వచ్చినా రికార్డు స్థాయి ధరలో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జమ్మిగుంట వ్యవసాయ మార్కెట్‌లో రోజురోజుకూ పత్తి ధరలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత యేడాది ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల  పత్తి దిగుబడి వచ్చినా క్వింటాలుకు 4 వేల నుంచి 5 వేల వరకు మాత్రమే ధర పలికింది. దీంతో చేసిన ఖర్చులు కూడా రాలేదు. 
 
కానీ, ఈ యేడాది దిగుబడి తగ్గినప్పటికీ ధర మాత్రం రికార్డు స్థాయిలో రూ.9 వేల వరకు పలుకుతుంది. దీంతో పత్తి రైతులు సంతోష పడుతున్నారు. దేశ వ్యాప్తంగా పత్తి దిగుబడి ఈ యేడాది బాగా తగ్గిపోయింది. దీనికి కారణం విస్తారంగా వర్షాలు కురవడమే. అదేసమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా పత్తి ధర ఒక్కసారిగా పెరిగిందని వ్యాపారులు అభిప్రాయపడుతన్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments