Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న 'తెల్ల బంగారం'

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (11:45 IST)
పత్తిని తెల్ల బంగారంగా పిలుస్తుంటారు. ఈ పత్తికి సరైన గిట్టుబాటు ధర లేక అనేక మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, ఇపుడు ఈ తెల్ల బంగారం ధర సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.9 వేలను టచ్ చేసింది. పుష్కలమైన వర్షాలతో దిగుబడి తక్కువగా వచ్చినా రికార్డు స్థాయి ధరలో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా జమ్మిగుంట వ్యవసాయ మార్కెట్‌లో రోజురోజుకూ పత్తి ధరలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత యేడాది ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల  పత్తి దిగుబడి వచ్చినా క్వింటాలుకు 4 వేల నుంచి 5 వేల వరకు మాత్రమే ధర పలికింది. దీంతో చేసిన ఖర్చులు కూడా రాలేదు. 
 
కానీ, ఈ యేడాది దిగుబడి తగ్గినప్పటికీ ధర మాత్రం రికార్డు స్థాయిలో రూ.9 వేల వరకు పలుకుతుంది. దీంతో పత్తి రైతులు సంతోష పడుతున్నారు. దేశ వ్యాప్తంగా పత్తి దిగుబడి ఈ యేడాది బాగా తగ్గిపోయింది. దీనికి కారణం విస్తారంగా వర్షాలు కురవడమే. అదేసమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా పత్తి ధర ఒక్కసారిగా పెరిగిందని వ్యాపారులు అభిప్రాయపడుతన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments