Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ హైకోర్టులో కరోనా కలకలం : 10 మందికి పాజిటివ్

Webdunia
బుధవారం, 8 జులై 2020 (19:42 IST)
తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఏకంగా పది మందికి ఈ వైరస్ సోకింది. మొత్తం 50 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, పది మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ పరీక్షలు నిర్వహించిన వారిలో హైకోర్టు సిబ్బంది, సెక్యూరిటీ బలగాలు ఉన్నారు. 
 
కరోనా ఇన్ఫెక్షన్‌ను దృష్టిలో ఉంచుకుని హైకోర్టులోని ఫైళ్లు మొత్తం జ్యుడిషియల్ అకాడమీకి తరలించారు. ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించాలని నిర్ణయించారు. 
 
కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా రిజిస్ట్రార్ ఈ కరోనా వైరస్ కారణంగా కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అనేక మంది ఉద్యోగులతో పాటు.. న్యాయ సిబ్బంది కూడా ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో నాలుగైదు రోజుల పాటు హైకోర్టును మూసివేసి శానిటైజ్ కూడా చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments