కరోనా తాండవం, కోడిగుడ్లు అమ్ముకుంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయుడు

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (15:55 IST)
ఆయన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు, 15 ఏళ్ల పాటు ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారు. చేతిలో ఉన్న ఐదు డిగ్రీలతో గతంలో కుటుంబ పోషణను కొనసాగించాడు. కరోనా విజృంభణతో అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఉపాధి కరువైంది. చేతిలో ఐదు డిగ్రీల ఉన్నా నోటిలో ఐదు వేళ్లు పోలేని దుస్థితి ఏర్పడింది.
 
కరోనాతో ప్రైవేట్ ఉపాధ్యాయుల అవస్థలు అంతాఇంతా కాదు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన హైదర్‌ఖాన్ ఎంఏ, బిఈడీ, ఇంగ్లీష్‌లో పీజీ కూడా చేశారు. ఆ తర్వాత పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి అందరి ప్రరశంసలు అందుకున్నారు.
 
కాగా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రైవేట్ టీచర్లపై పడింది. తనతో పనులు చేయించుకున్న విద్యాసంస్థలు చేతులెత్తేసాయ్. దీంతో ఉపాధి కరవై పనిలేక సొంత ఊరికెళ్లి కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెట్టారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహంచలేకపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments