Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా తాండవం, కోడిగుడ్లు అమ్ముకుంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయుడు

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (15:55 IST)
ఆయన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు, 15 ఏళ్ల పాటు ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారు. చేతిలో ఉన్న ఐదు డిగ్రీలతో గతంలో కుటుంబ పోషణను కొనసాగించాడు. కరోనా విజృంభణతో అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఉపాధి కరువైంది. చేతిలో ఐదు డిగ్రీల ఉన్నా నోటిలో ఐదు వేళ్లు పోలేని దుస్థితి ఏర్పడింది.
 
కరోనాతో ప్రైవేట్ ఉపాధ్యాయుల అవస్థలు అంతాఇంతా కాదు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన హైదర్‌ఖాన్ ఎంఏ, బిఈడీ, ఇంగ్లీష్‌లో పీజీ కూడా చేశారు. ఆ తర్వాత పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి అందరి ప్రరశంసలు అందుకున్నారు.
 
కాగా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రైవేట్ టీచర్లపై పడింది. తనతో పనులు చేయించుకున్న విద్యాసంస్థలు చేతులెత్తేసాయ్. దీంతో ఉపాధి కరవై పనిలేక సొంత ఊరికెళ్లి కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెట్టారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహంచలేకపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments