Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కొత్తగా 66 కరోనా కేసులు.. గ్రీన్ జోన్‌లో మరో కేసు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (09:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్యలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. దీంతో ఈ కేసులు వెయ్యికి చేరువయ్యేలా కనిపిస్తోంది. శనివారం కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 46 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్లు నిర్ధారించారు. 
 
కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 766కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 427 కరోనా పాజిటివ్ కేసులు, హైదరాబాద్‌లో 286 యాక్టివ్ కేసులు, నమోదు కాగా, 131 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్‌ కాగా, 18 మంది మృతి చెందారు. 
 
మరోవైపు, ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌లో మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఒక కేసు నమోదైంది. ఇపుడు మరో కేసు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ జిల్లాలో మొత్తం 2 కేసులు నమోదయ్యాయి. 
 
జిల్లాలోని ఈదులగూడకు చెందిన మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. మర్కజ్‌ వెళ్లొచ్చిన సూర్యాపేటకు చెందిన వ్యక్తి ద్వారా సోకిందని అధికారులు చెబుతున్నారు. పూల వ్యాపారం చేస్తున్న మహిళ.. కాంటాక్ట్‌ అయినవారిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments