Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో మే 29 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తున్నాం.. కేసీఆర్

Webdunia
బుధవారం, 6 మే 2020 (14:21 IST)
రాష్ట్రంలో మే 29 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగిస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాను నియంత్రించామని.. ప్రజలంతా లాక్ డౌన్‌కు మంచిగా సహకరిస్తున్నారని.. మరికొన్నాళ్లు ఓపిక పడితే కరోనా నుంచి బయటపడుతామని తెలిపారు. ఇలాంటి ఎపిడ‌మిక్స్ వ‌చ్చిన‌ప్పుడు 70 రోజుల పాటు కంట్రోల్ చేయ‌గ‌లిగితే దానిని పూర్తిగా క‌ట్ట‌డి చేయొచ్చ‌ని వెల్లడించారు.  
 
ప్ర‌జ‌లంతా భౌతిక దూరం పాటించి మ‌రికొన్నాళ్లు స్వీయ నియంత్ర‌ణతో ముందుకు సాగాల‌ని కోరారు. కేంద్రం లాక్ డౌన్ లో స‌డ‌లింపులు ప్ర‌క‌టించింద‌ని, వాటిని య‌థావిధిగా అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు షాపులు తెరుచుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
రెడ్ జోన్ల‌లోనూ షాపుల‌కు కేంద్రం అనుమ‌తి ఇచ్చింద‌ని, కానీ మ‌న రాష్ట్రంలో ఏవీ తెర‌వ‌డానికి లేద‌న్నారు. నిర్మాణ ప‌‌నులు త‌ప్ప ఎటువంటి షాపులు తెర‌వ‌డానికి లేద‌న్నారు. తెలంగాణ‌లో ఆరు జిల్లాలు మాత్ర‌మే రెడ్ జోన్ లో ఉన్నాయ‌ని, మిగిలిన 27 జిల్లాలు ఆరెంజ్, గ్రీన్ జోన్ల‌లోకే వస్తాయ‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments