యేడాదికి ముందే సత్తా చూపిద్దాం... కేసీఆర్ వ్యూహం... గుత్తాతో రాజీనామా?

సార్వత్రిక ఎన్నికలకు ఒక యేడాది ముందు తమ సత్తా చాటేందుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు వ్యూహం రచించారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఎంపీ పదవికి రాజీనామా చేయించనున్నారు. ప్రస్

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (06:21 IST)
సార్వత్రిక ఎన్నికలకు ఒక యేడాది ముందు తమ సత్తా చాటేందుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు వ్యూహం రచించారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఎంపీ పదవికి రాజీనామా చేయించనున్నారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ ఎంపీగా గెలిచి తెరాసలో చేరిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో నల్గొండ ఎంపీ పదవికి గుత్తాతో రాజీనామా చేయించారు. తన రాజీనామా లేఖను ఈ నెల 14న పార్లమెంట్ స్పీకర్‌కు ఆయన అధికారికంగా అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఎంపీ పదవికి ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గెలవడం ద్వారా తమ పార్టీ సత్తా ఏంటో నిరూపించుకునే ఉద్దేశంలో తెరాస అధినేత కేసీఆర్ ఉన్నారని సమాచారం.
 
దీంతో నల్గొండ ఉపఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందుగానే తమ సత్తా చాటే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ ఉందని సమాచారం. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన నేతలు వారి పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుత్తా తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈ ఉపఎన్నికలో తెరాస గెలవడం ద్వారా తాము బలంగా ఉన్నామనే విషయాన్ని అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి తెలియజెప్పాలని కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments