Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు జాతకాల పిచ్చి.. అందుకే ముందస్తు ఎన్నికలు-విజయశాంతి

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (16:32 IST)
తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై ఒకప్పటి చెల్లెమ్మ ప్రస్తుత కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాములమ్మ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌కు వున్న జాతకాల పిచ్చితోనే తెలంగాణ ప్రస్తుతం ముందస్తు ఎన్నికలు వచ్చాయని.. విజయశాంతి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని విజయశాంతి విమర్శించారు. 
 
బంగారు తెలంగాణ రావాలంటే.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో రాక్షస పాలన అంతమై కాంగ్రెస్ పాలన వస్తుందని జోస్యం చెప్పారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక తెలంగాణ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 7న జరుగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ప్రజా కూటమికే ఓటు వేస్తారని విజయశాంతి వ్యాఖ్యానించారు. 
 
కరీంనగర్ జిల్లాలోని సుల్తాన్‌పూర్‌ రోడ్ షోలో విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. గత నాలుగేళ్లలో ఇచ్చిన హామీని కేసీఆర్ పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంచి ప్రజలను ఆయన మోసం చేశారని ఆరోపించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments