Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా నమూనాల సేకరణ నిలిపివేత!.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:48 IST)
కరోనా పరీక్షల పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, రెండు రోజుల పాటు నమూనాల సేకరణను నిలిపివేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే ల్యాబుల్లో నమూనాలు పేరుకుపోగా, నిన్నటికి 8,253 నమూనాలను పరీక్షించాల్సిన పరిస్థితి వుంది. వీటిని మరిన్ని రోజులు నిల్వ ఉంచితే తప్పుడు రిపోర్టులు వస్తాయన్న ఆలోచనతో, వైద్య వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
గడచిన 9 రోజుల వ్యవధిలో 36 వేల మంది నుంచి నమూనాలను అధికారులు సేకరించారు. అయితే, రాష్ట్రంలోని 10 ప్రభుత్వ ప్రయోగశాలల్లో రోజుకు 2,290 రిపోర్టులు మాత్రమే వెలువరించే అవకాశం ఉంది.

దీంతో పరిశీలించాల్సిన నమూనాలు పెరిగిపోయాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి శనివారం నుంచి నమూనాలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments