Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (11:27 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో కామారెడ్డికి బయలుదేరి వెళ్లారు. ఈ జిల్లాలోని బాన్సువాడలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి కారులో రోడ్డు మార్గంలో తిమ్మాపూర్ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. 
 
అక్కడ శ్రీదేవి, భూదేవి సతీసమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బ్రహ్మోత్సవ క్రతువులో పాల్గొన్న తర్వాతీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన దాదాపు రెండున్నర గంటల పాటు సాగనుంది. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. బాన్సువాడ పట్టణంతో పాటు ఆలయ ప్రాగణం, పరిసర ప్రాంతాలను సీఎం వ్యక్తిగత రక్షణ బృందం, డాగ్ స్క్వాడ్ నిశితంగా తనిఖీలు నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments