Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (11:27 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో కామారెడ్డికి బయలుదేరి వెళ్లారు. ఈ జిల్లాలోని బాన్సువాడలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి కారులో రోడ్డు మార్గంలో తిమ్మాపూర్ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. 
 
అక్కడ శ్రీదేవి, భూదేవి సతీసమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బ్రహ్మోత్సవ క్రతువులో పాల్గొన్న తర్వాతీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరానికి తిరిగి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన దాదాపు రెండున్నర గంటల పాటు సాగనుంది. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. బాన్సువాడ పట్టణంతో పాటు ఆలయ ప్రాగణం, పరిసర ప్రాంతాలను సీఎం వ్యక్తిగత రక్షణ బృందం, డాగ్ స్క్వాడ్ నిశితంగా తనిఖీలు నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments