నేడు కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (07:20 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పర్యటించనున్నారు. నిజానికి కొండగట్టుకు మంగళవారమే వెళ్లాలని నిర్ణయించారు. కానీ, మంగళవారం ఆలయ క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు చెప్పడంతో ఆయన తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకున్నారు. 
 
కాగా, ఈ పర్యటన కోసం సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి, బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో కొండగట్టుకు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటారు. ఇందుకోసం కొడిమ్యాల మండలోని నాచుపల్లి జేఎన్టీయూ కాలేజీ హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు.
 
కాగా, తెలంగాణాలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం అత్యంత  వైభవంతో పునర్ నిర్మించిన విషయం తెల్సిందే. అదే విధంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం ఆయన రూ.100 కోట్లు కేటాయించారు. పైగా, యాదాద్రి డిజైన్లు ఇచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికే కొండగట్టు బాధ్యతలను కూడా అప్పగించినట్టు సమాచారం. ఇందులోభాగంగా, ఆనంద్ సాయి ఇటీవల కొండగట్టు క్షేత్రంలో పర్యటించి అక్కడ పరిస్థితులపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments