Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటలతో వచ్చేది లేదు సచ్చేది లేదు... ఎంపీటీసీ భర్తకు సీఎం ఫోన్

Webdunia
శనివారం, 24 జులై 2021 (17:50 IST)
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. పైగా, ఈ నియోజకవర్గం నుంచే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలోని ఓ ఎంపీటీసీ భర్తకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఈటల చాలా చిన్నోడని, ఆయనతో వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. 
 
వైగా, ఈటల అంశాన్ని పక్కనపెట్టి దళిత ప్రతినిధులు ప్రగతి భవన్‌కు రావాలని కోరారు. జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్తకు ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఎల్లుండి దళితబంధు పథకంపై ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి రావాలని ఆహ్వానించారు.
 
తనుగుల ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామితో మాట్లాడిన సీఎం... ఎల్లుండి హుజురాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్ బయల్దేరాలన్నారు. రెండేళ్లలో దళితబంధును ప్రపంచవ్యాప్తం చేద్దామని.. దీని ప్రచారం కోసమే గ్రామానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను ఎంపిక చేసి పిలుస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments