Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటలతో వచ్చేది లేదు సచ్చేది లేదు... ఎంపీటీసీ భర్తకు సీఎం ఫోన్

Webdunia
శనివారం, 24 జులై 2021 (17:50 IST)
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. పైగా, ఈ నియోజకవర్గం నుంచే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలోని ఓ ఎంపీటీసీ భర్తకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఈటల చాలా చిన్నోడని, ఆయనతో వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. 
 
వైగా, ఈటల అంశాన్ని పక్కనపెట్టి దళిత ప్రతినిధులు ప్రగతి భవన్‌కు రావాలని కోరారు. జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్తకు ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఎల్లుండి దళితబంధు పథకంపై ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి రావాలని ఆహ్వానించారు.
 
తనుగుల ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామితో మాట్లాడిన సీఎం... ఎల్లుండి హుజురాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్ బయల్దేరాలన్నారు. రెండేళ్లలో దళితబంధును ప్రపంచవ్యాప్తం చేద్దామని.. దీని ప్రచారం కోసమే గ్రామానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను ఎంపిక చేసి పిలుస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

నీహారికకు రక్షా బంధన్ కట్టి ఆనందాన్ని పంచుకున్న రామ్ చరణ్, వరుణ్ తేజ్‌

Rajamouli: మహేష్ బాబు అభిమానులకు సర్ ప్రైజ్ చేసిన రాజమౌళి

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ నుంచి ఓనమ్.. సాంగ్

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ తో C-మంతం గ్లింప్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments