ఈటలతో వచ్చేది లేదు సచ్చేది లేదు... ఎంపీటీసీ భర్తకు సీఎం ఫోన్

Webdunia
శనివారం, 24 జులై 2021 (17:50 IST)
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. పైగా, ఈ నియోజకవర్గం నుంచే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలోని ఓ ఎంపీటీసీ భర్తకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఈటల చాలా చిన్నోడని, ఆయనతో వచ్చేది లేదు సచ్చేది లేదన్నారు. 
 
వైగా, ఈటల అంశాన్ని పక్కనపెట్టి దళిత ప్రతినిధులు ప్రగతి భవన్‌కు రావాలని కోరారు. జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్తకు ఫోన్ చేసి మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ఎల్లుండి దళితబంధు పథకంపై ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి రావాలని ఆహ్వానించారు.
 
తనుగుల ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామితో మాట్లాడిన సీఎం... ఎల్లుండి హుజురాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్ బయల్దేరాలన్నారు. రెండేళ్లలో దళితబంధును ప్రపంచవ్యాప్తం చేద్దామని.. దీని ప్రచారం కోసమే గ్రామానికి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను ఎంపిక చేసి పిలుస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments