Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు : 30 శాతం ఫిట్మెంట్

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (12:45 IST)
తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌ తీపి కబురు చెప్పింది. ఏకంగా 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించారు. అలాగే, రాష్ట్రంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించారు. 
 
శాస‌న‌స‌భ వేదిక‌గా పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తూ, 30 శాతం ఫిట్‌మెంట్ ఉత్త‌ర్వులు ఏప్రిల్ 1, 2020 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌మోష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్టి.. ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. 
 
ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హోంగార్డుల‌కు, వీఆర్ఏ, ఆశా వ‌ర్క‌ర్లు, అంగ‌న్‌వాడీల‌కు కూడా పీఆర్సీ వ‌ర్తిస్తుంద‌ని సీఎం ప్ర‌క‌టించారు. క‌రోనా వ‌ల్ల ఈసారి వేత‌న స‌వ‌ర‌ణ ఆలస్య‌మైంద‌న్నారు. ఉద్యోగుల వేత‌న స‌వ‌ర‌ణ ప్ర‌తి 5 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి చేసుకుంటున్నామ‌ని చెప్పారు. 
 
పీఆర్సీపై త్రిస‌భ్య క‌మిటీ అన్ని ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చించింది. ఉద్య‌మంలో ఉద్యోగుల పాత్ర అనిర్వ‌చ‌నీయ‌మైన‌ది అని కొనియాడారు. ఉమ్మ‌డి ఏపీలో టీఎన్జీవో తెగించి పోరాడింద‌న్నారు. తెలంగాణ సోయిని నిలిపి ఉంచ‌డంలో టీఎన్జీవో స్ఫూర్తి మ‌రువ‌లేనిది అని స్ప‌ష్టం చేశారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments