Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడుకి రాజ్యసభ సీటు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెల్లడించారు.

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (17:33 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సమావేశంలో ఆయన అన్ని విషయాలపై చర్చించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ సమావేశం అనంతరం తెరాస రాజ్యసభ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ (నల్లగొండ), బండ ప్రకాశ్ ముదిరాజ్ (వరంగల్) పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు రేపు నామినేషన్లు వేయనున్నారు. రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. 
 
కాగా, ఈ ముగ్గురు అభ్యర్థుల్లో జోగినపల్లి సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు కుమారుడు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్‌కు సంతోష్ కుమార్ సన్నిహితంగా ఉంటున్నారు. ప్రస్తుతం తెరాస ప్రధాన కార్యదర్శిగా, టీ న్యూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‍గా పని చేస్తున్నారు. అలాగే, పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments