Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతికుండగానే పాడి గేదెల తొడలు కోసిన క్రూరుడు!

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (09:28 IST)
తెలంగాణాలోని సిద్ధిపేట జిల్లా కొండపాక మండలోని సిరిసినగండ్ల శివారులో దారుణం జరిగింది. కొందరు యువకులు బతికి ఉండగానే పాడి గేదెల తొడలు కోసి మాంసం తీసుకెళ్లారు. నలుగురు నిందితుల్లో ఒకరు నేపాల్ యువకుడు కాగా, మిగతా ముగ్గురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిరిసినగండ్ల - దమ్మకపల్లి గ్రామాల మధ్య రాజేందర్‌ రెడ్డి అనే రైతుకు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేపాల్ చెందిన యువకుడితో పాటు ఏపీకి చెందిన మరో ముగ్గురు యువకులు పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రాజగిరి వెంకటేశం అనే రైతు తన పాకలోని గేదెల నుంచి పాలు పిండుకుని వెళ్లిపోయాడు.
 
రాత్రివేళ ఆ పాకలో దూరిన నలుగురు నిందితులు మాంసం కోసం రెండు గేదెల తొడలు కోశారు. దీంతో విలవిల్లాడిన గేదెలు రక్తస్రావమై చనిపోయాయి. ఉదయం పొలానికి వచ్చిన రైతు చనిపోయిన గేదెలను చూసి విస్తుపోయాడు. 
 
విషయం గ్రామస్థులకు చెప్పి నిందితుల కోసం గాలించగా వారంతా వ్యవసాయ క్షేత్రంలో మాంసం వండుతూ కనిపించారు. గ్రామస్థులను చూసి నిందితుల్లో ముగ్గురు పరారు కాగా, నేపాలీ యువకుడు సందీప్ (25) వారికి పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments