Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతికుండగానే పాడి గేదెల తొడలు కోసిన క్రూరుడు!

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (09:28 IST)
తెలంగాణాలోని సిద్ధిపేట జిల్లా కొండపాక మండలోని సిరిసినగండ్ల శివారులో దారుణం జరిగింది. కొందరు యువకులు బతికి ఉండగానే పాడి గేదెల తొడలు కోసి మాంసం తీసుకెళ్లారు. నలుగురు నిందితుల్లో ఒకరు నేపాల్ యువకుడు కాగా, మిగతా ముగ్గురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిరిసినగండ్ల - దమ్మకపల్లి గ్రామాల మధ్య రాజేందర్‌ రెడ్డి అనే రైతుకు ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నేపాల్ చెందిన యువకుడితో పాటు ఏపీకి చెందిన మరో ముగ్గురు యువకులు పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రాజగిరి వెంకటేశం అనే రైతు తన పాకలోని గేదెల నుంచి పాలు పిండుకుని వెళ్లిపోయాడు.
 
రాత్రివేళ ఆ పాకలో దూరిన నలుగురు నిందితులు మాంసం కోసం రెండు గేదెల తొడలు కోశారు. దీంతో విలవిల్లాడిన గేదెలు రక్తస్రావమై చనిపోయాయి. ఉదయం పొలానికి వచ్చిన రైతు చనిపోయిన గేదెలను చూసి విస్తుపోయాడు. 
 
విషయం గ్రామస్థులకు చెప్పి నిందితుల కోసం గాలించగా వారంతా వ్యవసాయ క్షేత్రంలో మాంసం వండుతూ కనిపించారు. గ్రామస్థులను చూసి నిందితుల్లో ముగ్గురు పరారు కాగా, నేపాలీ యువకుడు సందీప్ (25) వారికి పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments