Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణా వాసుల మృతి

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (14:42 IST)
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణా వాసులు మృత్యువాతపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ప్రమాద సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
వేగంగా వెళుతున్న కారు ఒకటి అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న ఎనిమిది మంది పర్యాటకుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు. పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చి వారు దుర్మరణం పాలయ్యారు. వీరిని ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలవారిగా మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. 
 
ఈ ప్రమాదం అమరావతి జిల్లాలోని చికల్దారా సమీపంలో జరిగింది. కారులో ఉన్న నలుగురు చనిపోగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మహారాష్ట్ర పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు ఏపీ 28 డిడబ్ల్యూ 2119గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments